వారాహి యాత్రకు ఘనస్వాగతం పలుకుదాం.. బొమ్మిడి నాయకర్

నరసాపురం నియోజకవర్గం: జూన్ 25, 26 తేదీలలో జరగబోయే వారాహి విజయ యాత్రలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకర్ మాట్లాడుతూ.. జూన్ 25వ తేదీ అనగా ఆదివారం సాయంత్రం 5 గంటలకు చించినాడ వద్దకు వారాహిలో రాబోయే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఘన స్వాగతం పలికి, బైక్ ర్యాలీలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. 26వ తేదీ ఉదయం నియోజకవర్గంలో పలువర్గాల నేతలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భేటీ అవుతారని తెలిపారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు నరసాపురం స్ట్రీమర్ రోడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు మరియు నియోజకవర్గ సమస్యలపై జనసేన పార్టీ తరపున గళం వినిపించనున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలు, నరసాపురం నియోజకవర్గ ప్రజలు అందరూ భారీగా తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులకు, వీరమహిళలు పాల్గొన్నారు.