అవినీతి ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారా?.. చిలకం మధుసూదన్ రెడ్డి

ధర్మవరం మండలం రేగాటిపల్లి గ్రామ పంచాయతీ లో ధర్మవరం పట్టణ సివారులోని 28 వ వార్డుకు వెనుక భాగాన ప్రభుత్వ భూమిలో మట్టి కొండను అధికార పార్టీ వ్యక్తులు తవ్వి కోట్ల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారని తెలియజేసినందుకు గాను.. చిలకం మధుసూదన్ రెడ్డి సతీమణి, చిలకం చాయాదేవి మీద అధికార పార్టీ వాళ్ళు గతంలో పెట్టిన అక్రమ కేసులలో భాగంగా విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసులు జారీ చేయడం జరిగింది, ఈ విషయం పై మీడియా మిత్రులతో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ప్రసంగించారు. అక్రమాలను ప్రశ్నించినందుకు అక్రమ కేసులు బనాయిస్తారా అంటూ.. మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.