రేగులపాడులో కణితి కిరణ్ పర్యటన

పార్టీ బలోపేతంలో భాగంగా జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ కోటబొమ్మాలి మండలం, రేగులపాడు గ్రామంలో పర్యటించి స్థానిక ప్రజలను కలుసుకొని జనసేన సిద్ధాంతాలను తెలియజేస్తూ.. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలను వివరిస్తూ గ్రామం అంతా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తమ గ్రామ ప్రధాన సమస్యలైన త్రాగునీరు, పారిశుద్ధ్య సమస్యలను కిరణ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ.. ప్రజలు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యలపై ఉన్నతాధికారులకు వివరించి.. సమష్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ పర్యటన లో కోటబొమ్మాలి మండల నాయకులు పల్లి కోటి, ఇలపండరమేష్, సుధీర్, శ్రీను ఎంపీటీసీ సభ్యులు, గ్రామ జనసైనికులు, రాము తదితరులు పాల్గొన్నారు.