వైసిపి బస్సు యాత్ర కోసం చెట్లు తొలగిస్తారా?

  • ప్రజల సొమ్ము జీతాలు తీసుకుంటూ అధికారపార్టీకి తొత్తులుగా పనిచేస్తున్నారా?
  • వైసిపి బస్సు యాత్రకు అడ్డుగా ఉన్నాయని చెట్లు తొలగిస్తారా?
  • చెట్లు తొలగింపుకు రెవెన్యూ, ఫారెస్ట్ అనుమతులు తీసుకున్నారా?
  • అసలు ఏ అధికారంతో చెట్లు తొలగించారు?

పార్వతీపురం: మెయిన్ రోడ్డులో చెట్లు తొలగింపుపై మున్సిపల్ మేనేజర్ ను నిలదీసిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరి
ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ అధికార పార్టీకి తొత్తులుగా పనిచేస్తారా? అంటూ జనసేన పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు మున్సిపల్ మేనేజర్ రూబేను దిబ్బను ప్రశ్నించారు. శుక్రవారం జనసైనికులతో కలిసి ఆయన మున్సిపల్ కార్యాలయం వద్ద మెయిన్ రోడ్ లో చెట్లు తొలగింపుకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మేనేజర్ తో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా పట్టణ మెయిన్ రోడ్ లో పెరిగిన చెట్లను ఏ అధికారంతో తొలగించారన్నారు. అధికార పార్టీ బస్సు యాత్రకు అడ్డంగా ఉన్నాయని చెట్లను తొలగిస్తారా? అన్నారు. చెట్లు తొలగింపుకు ఫారెస్ట్, రెవెన్యూ అనుమతులు తీసుకున్నారా? కౌన్సిల్ తీర్మానాలుచేశారా? అని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో ఉన్న చెత్త డంపింగ్ యార్డ్, తాగునీరు, శానిటేషన్, రోడ్లు, కాలువలు తదితర సమస్యలను పక్కనపెట్టి పచ్చగా ఉన్న చెట్లను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. ఆ సమస్యలు కనబడలేదా? అని ప్రశ్నించారు. ఆయా ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మేనేజర్ నీళ్లు నమలడంతో ప్రజల సొమ్ము జీతాలుగా తీసుకుంటూ అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించడం మానుకోవాలన్నారు. మరి కొద్ది రోజుల్లో అధికారం మారనుందని అప్పుడు ఏం చేస్తారని ప్రశ్నించారు. అనంతరం ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. దానికి సమాధానాలు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. అనంతరం నల్ల బెలూన్లు ఎగురువేసేందుకు ప్రయత్నించుగా సిఐ కృష్ణారావు, ఎస్ఐ నారాయణరావు తదితరులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారికి పోలీసులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఈ కార్యక్రమంలో బలిజంపేట మండల అధ్యక్షులు బంకురు పోలి నాయుడు, జనసైనికులు ఆ పార్టీ నాయకులు రాజాన బాలు, కర్రిమణి, చిట్లు గణేష్, తామరకండీ తేజ, గోవిందమ్మ, స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.