ఊపిరి ఉన్నంతవరకు జనసేనతోనే

  • జనసేనానికి కృతజ్ఞతలు తెలిపిన క్రియాశీలక సభ్యులు వంకిరి ఫ్రాన్సిస్

నంద్యాల జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు వంకిరి ఫ్రాన్సిస్ కు చాపిరేవుల మార్గం మధ్యలో ఆరు నెలల కిందట బైక్ ప్రమాదంతో గాయాలు అవ్వడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్రియాశీలక సభ్యత్వ భీమా ద్వారా 50 వేల రూపాయలను డైరెక్ట్ గా అకౌంట్ లో జమ చేయడం జరిగింది. కోలుకున్న వంకిరి ఫ్రాన్సిస్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా పాణ్యం నియోజవర్గ ఇన్చార్జ్ చింత సురేష్ బాబుకి మరియు నంద్యాల జనసేన నాయకులు చందు, సుందర్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు జనసైనికుల పట్ల ఎంతో శ్రద్ధతో అనునిత్యం మమ్మల్ని ఆదుకుంటున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి జీవితాంతం రుణపడి ఉంటానని, ఊపిరి ఉన్నంతవరకు జనసేనతోనే నా ప్రయాణమని తెలిపారు.