మహిళలు అన్నిరంగాల్లోనూ రాణించాలి: గవర్నర్ తమిళిసై
హైదరాబాద్: మహిళలు అన్నిరంగాల్లోనూ రాణించాలని, వారు సాధించలేనిది ఏమీ లేదని గవర్నర్ తమిళిసై అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఒర ప్రకటనలో మహిళలకు శుభా కాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో మహిళలకు శతాబ్ధాల నుంచి ప్రముఖ స్థానం ఉందని అన్నారు. ముఖ్యంగా మహిళను ఆది శక్తిగా కొలిచే సంప్రదాయం మన సంస్కృతి ఉందన్నారు. పురుషులు, మహిళలు అన్న వివక్ష లేకుండా మహిళలు అన్నిరంగాల్లో సమానత్వాన్ని సాధిస్తున్నారని చెప్పారు.
మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విజయాలుసాధిస్తున్న మహిళలు అందరికీ స్పూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. కోవిడ్ సమయంలో మహిళలు ఎంతో త్యాగం, సాహసాలతో తమ స్పూర్తిని చాటుకున్నారని గవర్నర్ కొనియాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా అదే స్పూర్తితో ముందు సాగాలని పిలుపునిచ్చారు.