గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: కోన తాతారావు

గాజువాక నియోజకవర్గం: జనసేన పార్టీని సంస్థాగత నిర్మాణంలో భాగంగా జనసేన పార్టీ పీఏసీ సభ్యులు మరియు గాజువాక నియోజకవర్గం ఇన్చార్జ్ కోన తాతారావు ఆధ్వర్యంలో వార్డు అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. వార్డు కార్యవర్గ సభ్యులు, బూత్ కన్వీనర్ స్థాయి వరకు పూర్తి స్థాయి నియామకం చేయాలని సూచిస్తూ జనసేన పార్టీని పటిష్టంగా తయారు చేయాలని తెలిపారు. ఈ మేరకు వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాటాలు, ర్యాలి, పాదయాత్ర దారా ప్రజల వద్దకు వెళ్లాలని జనసేన పార్టీ కోన తాతారావు ఆదేశాలిచ్చారు.