పలు కుటుంబాలకు మనోధైర్యాన్నిచ్చిన యడ్లపల్లి

  • కూనసాని దుర్గారావు కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన యడ్లపల్లి రామ్ సుధీర్
  • పార్టీ తరఫున రూ. 10000 ఆర్ధిక సాయం

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, పెడన మండలం ఉరివి గ్రామానికి చెందిన కూనసాని దుర్గారావు స్థానికంగా వ్యవసాయం చేసుకుంటూ పశువులను (గేదెలను) పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మే 18వ తేదీన తెల్లవారు జామున ఉరివి గ్రామంలో వారి ఇంటి వద్ద పశువుల ఆహారం కొరకు ఏర్పాటు చేసుకున్న 15 ఎకరాల గడ్డివాము ప్రమాదవశాత్తు అగ్నికి ఆహుతి అయ్యింది. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మంగళవారం ఉరివి గ్రామంలోని దుర్గారావు ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. దుర్గారావు గారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు బోయిన ఉదయ భాస్కర్ రావు, పంచకర్ల వీర స్వామి, దొండపాటి సత్యనారాయణ, పంచకర్ల వెంకట రమణ, దొండపాటి శ్రీనివాస్, చిన్నం నాని, వి సురేష్, పుల్లేటి దుర్గారావు, పోలగని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందర రాజు, దూసనపూడి భాను, దివి శ్రీనివాస్, బాదం వినోద్, దారపు రెడ్డి నవీన్, అంజి బాబు, పవన్ పాల్గొన్నారు.

  • యాక్సిడెంటులో గాయపడిన మెట్ల వీరేంద్రకు మనోధైర్యాన్నిచ్చిన యడ్లపల్లి రామ్ సుధీర్
  • పార్టీ తరఫున రూ. 5 వేలు ఆర్ధిక సాయం

కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామానికి చెందిన వీరేంద్ర ఇటీవల ప్రమాదవశాత్తూ కార్ యాక్సిడెంటులో బలమైన గాయాలపాలయ్యారు. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ మంగళవారం ముంజులూరు గ్రామంలోని మెట్ల వీరేంద్ర ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. జనసేన పార్టీ తరఫున రూ. 5 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. వీరేంద్ర కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దివి శ్రీనివాస్, పంచకర్ల సత్యనారాయణ, పుల్లేటి దుర్గారావు, పోలగని లక్ష్మీ నారాయణ, క్రోవి సుందర రాజు, బాదం వినోద్, దారపురెడ్డి నవీన్ అంజిబాబు, పవన్ పాల్గొన్నారు.