బుర్ర పవన్ కుటుంబానికి యడ్లపల్లి రామ్ సుధీర్ పరామర్శ
•పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయం
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన జనసైనికుడు బుర్ర పవన్
కృష్ణా జిల్లా, పెడన నియోజకవర్గం, నందిగామ గ్రామానికి చెందిన జనసైనికుడు బుర్ర పవన్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. పెడన-గుడివాడ మార్గంలో పెడన పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో పవన్ కాలు, వెన్నెముకలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానిక జనసేన కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు శ్రీ యడ్లపల్లి రామ్ సుధీర్ గారు శనివారం నందిగామలోని బుర్ర పవన్ ఇంటికి వెళ్లి అతని కుటుంబాన్ని పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. జనసేన పార్టీ తరఫున రూ. 10 వేల ఆర్ధిక సాయాన్ని అందచేశారు. బుర్ర పవన్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా సమాచారం ఇవ్వాలని స్థానిక జనసేన శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పెడన నియోజకవర్గ జనసేన నాయకులు, తోట నాగరాజు, పోలగాని లక్ష్మీ నారాయణ, చీర్ల నవీన్ కృష్ణ, రాజులపాటి సత్యనారాయణ, యర్రంశెట్టి రామాంజనేయులు, ఉచా వెంకయ్య, శింగంసెట్టి అశోక్ కుమార్, గడ్డిగోపుల నాగ, కొఠారి మల్లిబాబు, వినోద్, అంజిబాబు, బాకీ నాని,అఖిల్, సాయి, పవన్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/08/WhatsApp-Image-2022-08-13-at-6.16.39-PM-1024x768.jpeg)