నాదెండ్లను కలిసిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట: హైదరాబాద్ నగరంలోని తన నివాసంలో జనసేన పార్టీ పిఎసి చైర్మెన్‌ నాదెండ్ల మనోహర్ ను డిఆర్డిఏ రాష్ట్ర మాజీ అధికారి, జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం, వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి శాలువాతో సన్మానించారు. రాజంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, రానున్న ఎన్నికలలో గెలుపు బావుటా ఎగరు వేయాలని నాదెండ్ల మనోహర్ సూచించినట్లు ఆయన తెలియజేశారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లు శ్రీనివాసరాజు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి ఒకసైనికుడిలా పోరాడుతామని అన్నారు. జనసేన సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలలోకి తీసుకెళ్లడంలో శక్తి వంచన లేకుండా కృషి చేయడం జరుగుతోందని నాదెండ్ల మనోహర్ గారికి తెలియజేశారు. నియోజకవర్గంలో శ్రీనివాసరాజు సేవలను ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గుర్తించినారు.