అయ్యప్ప స్వామి భక్తులకు పండ్లు పంపిణీ చేసిన యల్లటూరు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: శేషమాంబపురం పంచాయతీ కోపురాసపల్లెకు చెందిన 100 మంది అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న భక్తులు శుక్రవారం మండల దీక్ష పూర్తి చేసుకొని శబరిమలై కు వెళ్తుండగా రాజంపేట రైల్వే స్టేషను నందు వారిని కలిసి వారందరికీ రాజంపేట జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు వివిధ రకాల పండ్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో యస్.ఎర్రపల్లె రాజేష్ వర్మ, జి.సుదర్శన్ రాజు, యస్.సుబ్రహ్మణ్యం, అనిల్ కుమార్ రాజు, సుబ్బరాయుడు, జగదీశ్, సిద్దయ్య, నరసింహ, మరియు రాజంపేట జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర, మాజీ జెట్పీటీసి యల్లటూరు శివరామరాజు, పి.వి.ఆర్ కుమార్, పత్తి నారాయణ, మౌల, నాసర్ ఖాన్, కట్టారుబాబు తదితరులు పాల్గొన్నారు.