నందలూరు మండలంలో జోరు పెంచిన యల్లటూరు

  • నందలూరు మండలంలో జోరు పెంచిన రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు
  • కార్యక్రమం జరిగిన గ్రామాలు: నూకినేనిపల్లి, బలిజపల్లి, బలిజపల్లి ఎస్సీ కాలనీ, కుంపినీపురం

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండలంలో జనంలో జనసేన అట్టహాసంగా కొనసాగింది. కనీవినీ ఎరుగని రీతిలో ప్రజాదరణ పొందుతూ ప్రజలతో మమేకమై జనసేన సిద్ధాంతాలని, జనసేన పార్టీ ఎన్నికల‌ గుర్తు “గాజు గ్లాసు” ని ప్రజలకి చేరువ చేస్తున్న నందలూరు మండల జనసైనికులు. ఈ కార్యక్రమానికి ముఖ్యాధితిగా జనసేన నాయకులు మాజీ జడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, మాజీ జడ్పీటీసీ సభ్యులు షబ్బీర్ అహ్మద్, కడిమిళ్ళ నివాస రాజు (రిటైర్డ్ ఎస్ ఐ)పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన పార్టీ నాయకులు ఆకుల చలపతి, భారతాల ప్రశాంత్, గురివిగారి వాసు, తిప్పాయపల్లి ప్రశాంత్, వెలకచర్ల హరిబాబు, మంటి వెంకట సుబ్బయ్య, భత్యాల వినయ్, పైడికొండ్ల సునీల్ గౌడ్, నందు, వెంకటేష్, భారతాల బాలాజీ, సుధాకర్, రవీంద్ర, కార్తీక్, శ్రీను, యానది, రాము మొదలగు జనసైనికులు పాల్గొని జనంలో జనసేన కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.