యర్రగొండపాలెం జనసేన-టీడీపీ ఆత్మీయ సమావేశం

యర్రగొండపాలెం, త్రిపురాంతకం పరిధిలోని అమ్మవారి శాల యందు యర్రగొండపాలెం నియోజకవర్గం జనసేన-టీడీపీ పార్టీలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ సమావేశంలో జనసేన-టీడీపీ భవిష్యత్ ఉమ్మడి కార్యాచరణ గురించి పలు అంశాలపై చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జనసేన పార్టీ నియోజకవర్గం ఇంచార్జీ డా.పాకనాటి గౌతమ్ రాజు, టీడీపీ ఇంచార్జీ ఎరిక్షన్ బాబు అలాగే ఇరు పార్టీల 5 మండల అధ్యక్షులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొని విజయవంతం చేయటం జరిగింది.