నూతన జనసేన కార్యాలయం ప్రారంభించిన యశస్వి

  • విజయనగరం నియోజకవర్గంలో వార్డు స్థాయిలో జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా అన్ని డివిజన్లోని జనసేన పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయడమే ధ్యేయం
  • జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి గారు

విజయనగరం నియోజకవర్గం: స్థానిక 31వ డివిజన్ జనసేన నాయకులు ఇజ్జురోతు సూర్య నాగేశ్వరరావు (నాగు) మరియు జనసేన నాయకులు ఆధ్వర్యంలో.. ఆదివారం సూర్యనగర్, కలువపువ్వు మేడ దగ్గర జనసేన పార్టీ “నూతన కార్యాలయం” ప్రారంభోత్సవం ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యశస్వి చేతులమీదుగా ఘనంగా జరిగింది. కార్యాలయం ప్రారంభోత్సవ అనంతరం “ప్రత్యేక పూజలు” నిర్వహించారు. అనంతరం యశస్వి మాట్లాడుతూ.. విజయనగరం నియోజకవర్గ ప్రతి డివిజన్లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించి వార్డు స్థాయిలో పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయమని అని అందుకుగాను ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను తమ తమ డివిజన్ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి 2024 లో జరిగే ఎలక్షన్లో జనసేన ~ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పనిచేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, పలువురు జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు, వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.