పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లతో రాష్ట్రానికి ఏమైనా అన్యాయం జరిగిందా జగన్ రెడ్డి?

  • గెలిపించింది ప్రజలకి మేలు చేస్తావని – పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడటానికి కాదు

ఎమ్మిగనూరు: జగన్ మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించింది ప్రజలకి మేలు చేస్తావని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తావని.. అంతే కానీ పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు గురించి మాట్లాడటానికి కాదు.. పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల నీకు గాని రాష్ట్రానికి గాని రాష్ట్ర ప్రజలు కానీ ఏమైనా అన్యాయం జరిగిందా అని జనసేన నాయకులు చల్లా వరుణ్ ప్రశ్నించారు. ఆదివారం వరుణ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రాకపోవడానికి.. పోలవరం పూర్తి కాకపోవడానికి.. ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ కాలండర్ రిలీజ్ చేయకపోవడానికి.. రాష్ట్రానికి పెట్టుబడులు రాకపోవడానికి పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు కారణమా సిగ్గుండాలి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడడానికి.. రాజకీయాలకు సంబంధం లేని మహిళలను గురించి కానీ పిల్లల గురించి గానీ మాట్లాడే వాళ్ళని మన రాయలసీమలో కొజ్జా అంటారు.. కానీ మాకు సంస్కారం అడ్డొచ్చి మాట్లాడలేకపోతున్నాం జగన్మోహన్ రెడ్డి.. లక్ష కోట్ల ప్రజల సొమ్మును దొబ్బేసి.. 13 సిబిఐ కేసులు మూడు ఈ డి కేసులో ఏ1 ముద్దాయిగా ఉండి 16 నెలలు జైల్లో చిప్పకూడితిని వచ్చిన నిన్ను… చంచలగూడా దొంగ అనాల…
రాష్ట్రాన్నికి 10 లక్షల కోట్ల అప్పు చేసి రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలేసి.. ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. నీకు అభివృద్ధి చేతకాక అంగడి వాడి వర్కర్స్.. మున్సిపాలిటీ వర్కర్స్… ఉపాధ్యాయులు నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని సమ్మెకు దిగుతున్నారు.. అది కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు.. జగన్మోహన్ రెడ్డి నీ చరిత్ర ముగిసిపోయింది ఇంకా మూడు నెలలు మాత్రమే.. జనసేన తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది. నిన్ను మళ్ళీ చంచలగూడ జైలుకి పంపిస్తారు ఖబడ్దార్ అని వరుణ్ పేర్కొన్నారు.