ఈదుస్థితికి వైసీపీ నాయకులే కారణం

*జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట అన్నమయ్య జిల్లా కేంద్రంగా కాకపోవడానికి రాజంపేట ప్రాంతంలోని వైయస్సార్సీపి పార్టీకి చెందిన నాయకులు ప్రస్తుతం పదవుల్లో ఉన్న అధికార పార్టీ నాయకులే కారణమని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఆకేపాటి అమర్నాథరెడ్డి ఇంతవరకు రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని ఒత్తిడి తేకుండా నోరు దపకపోవడంతో అభ్యంతరం ఏమిటన్నారు. రాజంపేట ప్రజలకు చేసే అన్యాయంకన్నా మీకు మీ పదవులే ముఖ్యమా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా వైసీపీ నేతల్లో చిత్తశుద్ధి ఉంటే ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలన్నారు. పదవులకు రాజీనామా చేసి అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేటను సాధించుకుంటే తప్ప వైసీపీ నేతలను ఎవరు నమ్మరన్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఉద్యమాలు చేసి రాజంపేటను అన్నమయ్య జిల్లాగా చేసేంతవరకు ప్రతినాయకులు పోరాడాలన్నారు.