యువత చూపు జనసేన వైపే: కొన్నేడీ లక్ష్మణ రావు

అరకు నియోజకవర్గం, హుకుంపేట మండలం, కమ్మయ్యపేట పంచాయితీ, రాతులపుట్టు గ్రామంలో అరకు జనసేన పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొన్నేడీ లక్ష్మణ రావు పర్యటించారు. పర్యటనలో భాగంగా లక్ష్మణ రావు గ్రామస్తులకు ఉన్న సమస్యలు తెలుసుకొని, అలాగే జనసేన యొక్క సిద్ధాంతాలను మరియు అదే పార్టీ బలోపేతం కోసం మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామస్తులు అందరూ జనసేనలో చేరడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారని పేర్కొన్నారు.