ఇసుక నుండి కాసులు పిండుకొనే విద్యలో మహాప్రావీణ్యులు వైసీపీ నాయకులు: రియ

రాష్ట్రాన్ని తవ్విపారెయ్యడంలో వాళ్ళు ఉద్దండ పిండాలు. ఇసుక ర్యాంపుల్లో వేలాది లారీలు, వందలాది మంది కార్మికులు, పదుల సంఖ్యలో ప్రొక్లైయినర్ల ఇసుక తవ్వకాలు రాత్రింబవళ్ళు కొనసాగుతున్నాయి. లారీలు వెళ్ళేందుకు నదుల్లో ఏకంగా రోడ్లు నిర్మించారంటే అధికార పార్టీ వైసీపీ నాయకుల ఆగడాలు ఎంత తెగించాయో ప్రజలు అర్థం చేసుకోవాలి. నదీ ప్రవాహానికి అడ్డంగా రోడ్డు వేయకూడదన్న నిబంధన ఉన్నా, దాన్ని తుంగలో తొక్కి సహజ సంపదను యధేచ్చగా దోపిడీ చేస్తున్నారు. బకాసురుడి ఆకలి అయినా తీరుతుందేమో కానీ అధికార పార్టీ నాయకుల ధన దాహం తీరేటట్లు లేదు. ధన దాహంతో భవిష్యత్‌ను తవ్వేస్తున్నారు. విచ్చలవిడి ఇసుల తవ్వకాలు భావితరాల అవసరాలకు, జలసంక్షోభానికి, పర్యావరణ విఘాతానికి ప్రధాన కారణం కాబోతున్నాయి. ప్రకృతి ప్రసాదించిన జాతి సంపదను కాపాడాల్సిన ప్రభుత్వ పెద్దలు ఇసుక మాఫియాకు అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో కృష్ణా, గోదావరి,పెన్నానదులలో కాక చిన్న, చిన్న ఉపనదుల్లో ఏళ్ల తరబడి కొండలు వలే, గుట్టలు వలె పడివున్న ఇసుకను వేలాది లారీలతో కొల్లగొట్టేస్తున్నారు. జలవనరుల పరిరక్షణ చట్టాలు, నిబంధనలు ఎన్ని వున్నా ఆ నిబంధనలు ఉల్లంఘించి మరీ తవ్వేస్తున్నారు.
1-2 మీటర్లు లోతు కన్నా ఎక్కువ తీయకూడదు. కానీ ఇసుక ఎంత లోతు ఉంటే అంత లోతు తవ్వేస్తున్నారు. కృష్ణా, గోదావరి పరివాహక ప్రాంతాల గ్రామాలలో ఉన్న ఇసుక ర్యాంపులు అధికార పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఇసుక మాఫియా బరితెగించి ఇసుకను తరలిస్తున్న పద్దతిని చూస్తే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. కృష్ణా నదికి అడ్డంగా పెద్ద,పెద్ద తూములు వేసి కృష్ణా నదిలో రోడ్డు నిర్మించారు. దీనిని బట్టి ఇసుక మాఫియా ఎంత యథేచ్ఛగా సహజ వనరులను దోపిడీ చేస్తున్నదో అర్ధం అవుతుంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుకను వ్యాపార వస్తువుగా మార్చడంతో ఇసుక మాఫియా రాష్ట్ర భవిష్యత్ తవ్వి పారేస్తుంది. అనుమతి 2 కోట్ల టన్నులు ఉంటే, 6 కోట్ల టన్నుల వరకు తవ్వుతున్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల దోపిడీ జరుగుతుంది. మొత్తంగా 50 వేల కోట్ల దోపిడీ జరిగింది.

జగన్ నాలుగేళ్లలో 3 సార్లు ఇసుక పాలసీలు మార్చారు. తెలుగుదేశం హయాంలో ట్రాక్టర్ ఇసుక రూపాయలు 1500 ఉండగా జగన్ హయాలో ట్రాక్టర్ రూపాయలు 5000 వేలకు చేరింది. రాష్ట్రంలో జయప్రకాష్ పవర్ వెంచర్స్ పేరుతో అధికార పార్టీ పెద్దలు యథేచ్చగా సాగిస్తున్న ఇసుక దోపిడీకి కారణం జేపీ వెంచర్స్‌ కాదని, ఆ సంస్థే అధికారికంగా స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలిపినట్లు సమాచారం. ఇసుక తవ్వేది తాను కాదని, విక్రయించేదీ కూడా తాను కాదని ఆ సంస్థ చెబుతోంది. ఇసుక రేవుల్లో బిల్లులు మాత్రం జేపీ సంస్థ పేరుతో జారీ అవుతున్నాయి. ఈ పని వేరే వాళ్లు సబ్‌ కంట్రాక్ట్‌
తీసుకొన్నారని జేపీ సంస్థ చెపుతోంది. అధికారికంగా సబ్‌ కంట్రాక్ట్‌ వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు బిల్లులు మాత్రం జేపీ పేరుతో ఇవ్వడం ఏమిటి? జేపీ సంస్థ ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక బొక్కుతున్నట్లు బట్టబయలైంది. రాష్ట్రంలో ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీ భాగోతాన్ని జేపీ సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. రాష్ట్రంలో ఏడాదికి రూ.10 వేల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 40 వేల కోట్ల మేర ఇసుకను రేవుల్లో తవ్వి విక్రయించినట్లు సమాచారం. ప్రభుత్వానికి మాత్రం చిల్లర చెల్లించి ఇసుకాసురులు కనక రాశులు పోసుకుంటున్నారు.

దీనిపై చంద్రబాబు ప్రశ్నించినా ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాధానం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇసుక దోపిడీ జరుగుతుంది అంటూ ఆరోపణలు చేసి ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి, ఇసుక దోపిడీకి లాకులెత్తారు. ఇసుక దొరకకుండా చేసి 40 లక్షల మంది భవన నిర్మాణరంగ కార్మికుల పొట్టగొట్టారు. ఇసుక అక్రమ తవ్వకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్ స్పందించింది. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ తవ్వకాలపై నిగ్గుతేల్చేందుకు ఎన్‌జిటీ అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ, గనులశాఖ, కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో సంయుక్త కమిటీని ఏర్పాటు చేసింది. ఇసుక తవ్వకాల్లో హెవీ మిషనరీ ఉపయోగించరాదన్న ఎన్జీటీ ఉత్తర్వులను పక్కనపెట్టి గోదావరి, కృష్ణా నదుల్లో డ్రెడ్జర్లు ఉపయోగించి తవ్వకాలు సాగించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లలో సెమీ మెకనైజ్డ్ ఇసుక తవ్వకాలు నిలిపివేయాలి. కానీ రాజ్యాంగబద్ద సంస్థ ఎన్జీటీ ఆదేశాలు, కోర్టుల ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రభుత్వ పెద్దల అండతో ఇసుక మాఫియా చెలరేగిపోతున్న తీరు చూస్తే చట్టాలు, నిబంధనలు వైసీపీ నాయకులకు వర్తించవా అన్న రీతిగా ఉంది.

రాష్ట్రంలో ఇసుక తవ్వకాలకి కాంట్రాక్ట్ జయప్రకాష్ పవర్ వెంచర్స్ ఇచ్చింది. అధికార పార్టీ పెద్దలు యథేచ్చగా సాగిస్తున్న ఇసుక దోపిడీకి కారణం జేపీ వెంచర్స్‌ కాదని, ఆ సంస్థే అధికారికంగా స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలిపినట్లు సమాచారం. ఇసుక తవ్వేది తాను కాదని, విక్రయించేదీ కూడా తాను కాదని ఆ సంస్థ చెబుతోంది. ఇసుక రేవుల్లో బిల్లులు మాత్రం జేపీ సంస్థ పేరుతో జారీ అవుతున్నాయి. ఈ పని వేరే వాళ్లు సబ్‌ కంట్రాక్ట్‌ తీసుకొన్నారని జేపీ సంస్థ చెపుతోంది. అధికారికంగా సబ్‌ కంట్రాక్ట్‌ వేరే వాళ్లకు ఇచ్చినప్పుడు బిల్లులు మాత్రం జేపీ పేరుతో ఇవ్వడం ఏమిటి? జేపీ సంస్థ ముసుగులో అధికార పార్టీ నాయకులు ఇసుక బొక్కుతున్నట్లు బట్టబయలైంది. రాష్ట్రంలో ఇసుక పేరుతో జరుగుతున్న దోపిడీ భాగోతాన్ని జేపీ సంస్థ నివేదిక బట్టబయలు చేసింది. మామూలుగా ఇసుక తవ్వకాలు ఒకటి లేదా ఒకటిన్నర మీటర్ లోతుకు తవ్వాల్సి ఉండగా వీళ్ళు భూమిలో 3-4 మీటర్ల లోతువరకు ఇసుక తవ్వుతున్నారు. ఒక్కొక్క లారీలో 35 నుండి 40 టన్నుల వరకు ఇసుక లోడు చేస్తూ.. రోజు కొన్ని లక్షల టన్నుల ఇసుకను బెంగుళూరు హైదరాబాద్ చెన్నై నాగరాలకి వేల లారీలు, ట్రాక్టర్లతో రవాణా చేస్తున్నారు. ఇక వర్షాకాలం వస్తే ముందస్తు అవసరాల కోసం వివిధ జిల్లాలలో లక్షల టన్నుల్లో ఇసుకను స్టాక్ పాయింట్లలో నిల్వ చేశారు. కొండల్ని తలపించేలా కుప్పలు పోసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయంలో గనులు శాఖ అధికారులు వైసీపీ నేతలకు అండగా నిలిచారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న ఇసుక దందాకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులే నేతృత్వం వహిస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడుతున్నా ఎన్‌పోర్స్‌మెంట్ బ్యూరో [సెబ్] అటు వైపు కన్నెత్తి చూడదు. ఇసుక ర్యాంపుల్లో వే బ్రిడ్జిలు లేవు. కేవలం అంచనాల మేరకు లోడ్ చేస్తున్నారు. ఇసుక తవ్వకాలు, విక్రయాలు, రవాణాపై గనుల శాఖ ఎస్‌ఈబీ అధికారులు తనిఖీలకు వెళ్లరు. ఎంత లోతు ఇసుక తవ్వుతున్నా అడిగే నాథుడే లేదు. నాడు 12 వందలకు వచ్చే ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు 6 వేలు పెట్టి కొనాల్సివస్తోంది. రాష్ట్రంలో గ్రావెల్, మైనింగ్, మట్టిలను
నాలుగున్నరేళ్లుగా యదేచ్ఛగా దోచుకుంటు వస్తున్నారు. హైవే పక్కనే డంప్ లు పెట్టి దోచుకుంటున్నారు. ఎక్కడ ఇసుక ఉంటే అక్కడ ప్రొక్లైనర్ తో ఇసుకను దోచుకుంటున్నారు. వీటన్నింటికి మైనింగ్ ఎండి, కార్పొరేషన్ వీసీ అలాగే జగన్ రెడ్డి సమాధానం చెప్పగలరా? ఇసుక రేవులు, నిల్వ కేంద్రాల్లో డిజిటల్ చెల్లింపులు అంగీకరించడం లేదు. నగదు చెల్లిస్తేనే ఇసుక లోడ్ చేస్తున్నారు. చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపులు జరుగుతుంటే రోజు కోట్లలో వ్యాపారం జరిగే ఇసుకకు ఆన్ లైన్ చెల్లింపులకు అనుమతి లేకపోవడం అంటే డైరెక్టు నగదు చెల్లింపులు ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయి. ఇసుకను కొల్లగొడుతున్నా, ప్రభుత్వానికి ఆదాయం రాకపోయినా పట్టించుకోవడం లేదు. దీని మూలంగా నదుల భౌగోళిక స్వరూపాలు మారి ఫలితంగా వరదలు, కరువులు సంభవించే ప్రమాదం ఉంది. ఆనకట్టల పునాదుల స్థిరత్వం దెబ్బతిని వాటి ఉనికే ప్రశ్నార్థకం అవుతుంది.

జగన్ ఇసుక అక్రమార్జన కోసం రూ.50 వేల కోట్ల ఆదాయం సంపాదించి 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఇబ్బందుల్లో పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వంపై మొట్టమొదటి ప్రజా పోరాటం 3 నవంబర్ 2019 నాడు వైజాగ్ నందు ఇసుక కోసం భవన నిర్మాణాల కార్మికుల మద్దతుగా వారికోసం ఒక లాంగ్ మార్చ్ నిర్వహించారు. అది మాకు ఉన్న చిన్న శుద్ది అని జనసేన వీరమహిళ రియా అన్నారు