ఆమదాలవలస జనసేన ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమ విస్తృత ప్రచారం

ఆమదాలవలస నియోజవర్గం, జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్ ఎంపీటీసీ మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో జనసేన పార్టీ యువశక్తి కార్యక్రమం ప్రచారంలో భాగంగా వైకుంఠపురం గ్రామంలో గోడ పత్రాలు పంచి యువశక్తి కార్యక్రమాము గురుంచి తెలియజేస్తూ, కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరుపేరునా మనవి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైకుంఠపురం గ్రామం జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.