జనసేన నాయకులు నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన సురేష్ వరికూటి

హైదరాబాద్, ప్రశాశన్ నగర్లో గల జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన నాయకులు మరియు పిఏసి సభ్యులు నాగబాబుని సోమవారం జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు సురేష్ వరికూటి మరియు శతఘ్ని న్యూస్ వ్యవస్థాపకులు నాయుడు నిమ్మకాయల మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనతరం నాగబాబుతో భేటీ అయ్యి జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జనసేన నాయకులతో నిర్వహిస్తున్న జూమ్ సమావేశాలను మరియు క్షేత్ర స్థాయిలో జనసేన గాజు గ్లాసు సింబల్ ను తీసుకెళ్ళేవిధంగా రూపొందించిన జనంలోకి జనసేన ద్వారారా 25 నియోజకవర్గాలకు పంపించిన 15000 పోస్టర్ల గురించి మరియు యువశక్తి కార్యక్రమానికి జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ తరపున రూపాయలు 1,01,116/- నాదెండ్లకు అందజేసిన వివరాలను జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ వ్యవస్థాపకులు సురేష్ వరికూటి వివరించగా, జనసేన తరపున జరిగే కార్యక్రమాలని శతఘ్ని న్యూస్ ద్వారా బాహ్యప్రపంచానికి తెలియజేస్తున్న వివరాలను నాయుడు నిమ్మకాయల తెలియజేసారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించి పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసేవారిని పార్టీ ఎపుడూ గుర్తిస్తుందని, అదేవిధంగా ఏ విధమైన సహకారం కావాలన్నా ఆయన తరపునుండి అందించేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటానని తెలిపారు.