సంక్షేమ పథకాలతో అభివృద్ధి శూన్యం

  • పవన్ అన్న ప్రజా బాట 127వ రోజు

రాజంపేట నియోజకవర్గం: వీరబల్లి మండలంలోని వంగిమల పంచాయతీ, ఉప్పరపల్లి పంచాయితీలో రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇన్చార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివారం పవన్ అన్న ప్రజా బాట 127వ రోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా అప్పులు పాలు చేసిన ఈ ప్రభుత్వానికి ఓట్ల రూపంలో తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.జనసేన నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి జనసేన మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్య పంతులు చేశారు. ఎక్కడ చూసినా దౌర్జన్యాలు గుండా రాజకీయాలు దోపిడీలు చేస్తూ వైకాపా పాలన కొనసాగుతుందని తెలిపారు ఎదురు తిరిగిన వారిపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి వారిని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత కార్యదర్శి రాటాల రామయ్య, జనసేన నాయకులు జయరామయ్య, స్వామి, కొత్తూరు వీరయ్య ఆచారి, చౌడయ్య, గోవర్ధన్ ఆచారి, పోలిశెట్టి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.