జనం కోసం జనసేన మహాయజ్ఞం 652వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: “ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 652వ రోజు కార్యక్రమం గురువారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 653వ రోజు కార్యక్రమం శుక్రవారం గోకవరం మండలం, కొత్తపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్రలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గోకవరం మండల ఉపాధ్యక్షులు వేముల రమణ మూర్తి, కొత్తపల్లి నుండి గ్రామ అధ్యక్షులు సొలా అంజిబాబు, పువ్వుల శ్రీదేవీ, వేముల దేవి, వేముల శ్రావణి దేవి, పల్లా భవాని, జల్లూరి శ్రీను, చేదులూరి సతీష్, వనం ప్రదీప్, మధారపు ధర్మేంద్ర, మిరియాల శివ, మాగంటి రాజ, దాడిశెట్టి అనిల్, యాట్టం ఠాగూర్, కామరాజుపేట నుండి జాజుల అశోక్, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, పుగమళ్ళ పెద్దకాపు, అడబాల శ్రీరామ్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు లకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన జల్లూరి శ్రీను కుటుంబ సభ్యులకు పాటంశెట్టి సూర్యచంద్ర హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.