జనసేనాని కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం

జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ జనసేన రైతు భరోసా యాత్ర మొదలుపెట్టి రైతన్నలకు అండగా నిలిచిన జనసేనుడు.

పవన్ అన్న రైతన్నకు అండగా ఉండడం ఇష్టం లేని పాలకపక్షం తన పెంపుడు కుక్కలను పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద మొరగడానికి పంపిస్తున్నాడు…. మీకు చేతనైతే రైతన్నలకు అండగా ఉండండి అంతేగాని.. రైతన్నలకు అండగా నిలిచిన జనసేన శ్రేణులపై కాదు మీ దుర్మార్గమైన కార్యకలాపాలు.

కుటుంబంలో ఒకరు చనిపోతే ఆ కుటుంబానికి శోకం అదే ఒక రైతు చనిపోతే దేశానికే శోకం..

ఊరు, పొలం, విత్తనం, పండించడం ఇవే ప్రపంచం అనుకోని బ్రతికే రైతుకి ఏమివ్వగలం తనకు కావాల్సిన బలమైన ఎరువులు, నాణ్యమైన పురుగు మందులు, పొలాలకు సరిపడేంత నీరు, పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవి మాత్రమే కావాలి రైతన్నలకు ఎన్ని ప్రభుత్వాలు మరినా అవే కష్టాలు రైతన్నలకు.

పవన్ రావాలి పాలన మారాలి.. పవన్ రావాలి రైతులు కన్నీటి కష్టాలు తీర్చాలి..

జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసి మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు చనిపోయిన కౌలు రైతులకు నష్టపరిహారం అందలేదు.

రైతన్న కన్నీటి కష్టాలు ఎన్నడు తీరుని శోకాలు అప్పులతో ఆత్మహత్యలు తలరాత మారని బ్రతుకులు..

నష్టాన్ని కష్టాన్ని భరించే రైతన్న అవమాన బాధల్ని ఎదిరించే రైతన్న మన కోసం కష్టపడే రైతన్న,
అయినా రైతన్నకు ఏనాడు కంటినిండా నిద్రపోడు, రైతన్నకు కడుపునిండా మెతుకు దొరకడం లేదు,
గిట్టుబాటు ధర పంటకు రాక మోడు భారీ పోయే రైతన్న బతుకులు..

కన్నీళ్లతో నేలంతా తడిసి వర్షాలు పడక పొలాలన్నీ ఎండిపోయి రైతన్న పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు… జవాన్ ఎంతో రైతన్న కూడా అంతే..

దేశానికి ఆకలి తీర్చే మన రైతన్న దేశానికి రాజు ఎప్పుడు అవుతాడో.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం… జై జవాన్.. జై కిసాన్..