బీజేపి నేత నల్లాను కలిసిన అయితాబత్తుల

కోనసీమ జిల్లా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లా పవన్ కుమార్ ను అమలాపురం ఆయన నివాసంలో అమలాపురం జనసేన-తెలుగుదేశం-బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్ధి అయితాబత్తుల ఆనందరావు మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో ఏ ఎమ్ సి మాజీ చైర్మన్ అల్లాడ స్వామి నాయుడు, తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి కర్రిరామస్వామి (దత్తుడు) బొర్రా ఈశ్వరరావు, మట్ట మహాలక్ష్మి ప్రభాకరరావు, బొర్రా చిట్టిబాబు తదితరులున్నారు.