శ్రీ వరాహస్వామికి బాలాలయ సంప్రోక్షణ

తిరుమలలోని శ్రీ వరాహస్వామి ఆలయంలో గురువారం ఉదయం బాలాలయ సంప్రోక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమలో భాగంగా రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకు శ్రీ వరాహస్వామివారు తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. పెద్దసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఊరేగింపులో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్‌, అధికారులు పాల్గొన్నారు.