జనసేన మాదాసు రాము ప్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో చలివేంద్రం

పెనమలూరు మండలం, యనమలకుదురు డొంక రోడ్డులో చెట్టు సెంటర్ నందు ఆదివారం ఉదయం, జనసేన పార్టీ మాదాసు రాము ప్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి సందర్భంగా చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. అమ్మి శెట్టి వాసు జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మరియు విజయవాడ సిటీ జనసేన పార్టీ నాయకులు వెన్న శివశంకర్, జిల్లా జనసేన పార్టీ సహాయ కార్యదర్శి కాకాని లోకేష్, పెనమలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కరిమి కొండ సురేష్, గ్రామ పెద్దలు, జనసేన పార్టీ అభిమానులు సానుభూతి మాదాసు రాము ప్రెండ్ సర్కిల్ వారి సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతం అయింది.