బొలిశెట్టి నామినేషన్ కు భారీగా తరలి రండి!

తాడేపల్లిగూడెం: కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమానికి టిడిపి జనసేన బిజెపి శ్రేణులు భారీగా తరలిరావాలని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని టిడిపి కార్యాలయంలో గురువారం టిడిపి, జనసేన, బిజెపి ముఖ్య నాయకులు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నామినేషన్ వేడుకకు మూడు పార్టీల నుంచి గ్రామస్థాయి అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని కోరారు. ఉదయం 9 గంటలకే పెంటపాడులో వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని అక్కడి నుంచి ర్యాలీగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్ డి ఓ) కార్యాలయానికి చేరుకునే నామినేషన్ పత్రాలు సమర్పిస్తామని వివరించారు. ప్రజలంతా రేపటి నుంచి ఎన్నికలకు సమయత్వం కావాలని దుర్మార్గపు జగన్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసేందుకు నామినేషన్లు నాంది పలకాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు.