కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ కన్నుమూత

సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు అహ్మద్​ పటేల్ ​ (71)  కన్నుమూశారు. సోనియా గాంధీకి రాజకీయ సలహాదారుగా… యూపీఏ హయంలో చక్రం తిప్పిన ఆయన… మిత్రపక్షాలతో చర్చించి విషయాలు కొలిక్కి తేవడంలో దిట్ట. ఒక రకంగా చెప్పాలంటే… ప్రణబ్ ముఖర్జీ తరువాత కాంగ్రెస్‌లో కష్టాలను తీర్చడంలో కీలక భూమిక పోషించారు. మాటిమాటికీ పార్టీలు మారే నేతలున్న ఈ రోజుల్లో… కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ ప్రయాణం సాగించి… అధికారంలో ఉన్నా, లేకపోయినా… అదే పార్టీలో కొనసాగుతూ… తుదిశ్వాస విడిచారు అహ్మద్ పటేల్. దేశంలో ఎంతో మందిని పొట్టనపెట్టుకున్న కరోనా వైరస్… ఈ మహానేతను కూడా తిరిగిరాని లోకాలకు తీసుకుపోవడం… కాంగ్రెస్‌కే కాదు… దేశానికీ తీరని లోట. అక్టోబర్ 1న కరోనా బారిన పడిన అహ్మద్ పటేల్… 71 ఏళ్ల వయసులో… బుధవారం తెల్లవారు జామున… వివిధ అవయవాలు పనిచేయకపోవడంతో… ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో కన్నుమూశారు.