ప్రజా చైతన్య యాత్ర 28వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం: తెర్లం మండలం, ఆమిటి గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జి గిరడా అప్పలస్వామి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ప్రజా చైతన్య యాత్ర 28వ రోజు కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటా పర్యటించి, గ్రామ ప్రజల నుండి సమస్యలు తెలుసుకొని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇందులో బొబ్బిలి నియోజకవర్గం మరియు తెర్లం మండల జనసైనికులు పాల్గొన్నారు.