ప్రజా సమస్యలను పరిష్కరించలేని వైసిపి ని సాగనంపండి.. మాడుగుల జనసేన

  • జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన కార్యక్రమంలో గుడ్లూరు జనసేన

గుడ్లూరు: జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కందుకూరు ఇంచార్జ్ పులి మల్లికార్జున ఆదేశాల మేరకు జనంలోకి జనసేన.. జనం కోసం జనసేన .. కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రమైన గుడ్లూరు గ్రామ పరిదిలో 2 కి.మీ.దూరంలో ఉన్న ఎమ్.ఎస్.ఆర్ ఆద్వర్యంలో జనసేన నాయకులు పర్యటించి కాలనీ వాసుల సమస్యలు, వాలంటీర్ల పనితీరును అడిగి తెలుసుకోగా.. ఈ క్రమంలో కాలనీ వాసులు వాయుగుండ ప్రభావంతో గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు రోడ్లు సక్రమంగా లేక, కరెంటు స్తంబాలు పడిపోవడంవలన విద్యుత్ లేక చీకటిలో వారు పడుతున్న ఇబ్బందులను తెలిపి అదికార పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో వచ్చారు తప్ప మళ్ళీ తమ బాగొగులు చూసేందుకై రాలేదని కాలనీ వాసులు తమకు వివరించి నట్లు గుడ్లురు మండల కన్వీనర్ అన్నంగి చలపతి అన్నారు. గడప గడపకు తిరుగు సంక్షేమ పదకాలు ఇస్తున్నాము అని చెప్పుకు ని తిరుగుతూ ఉన్న అధికార పార్టీ నాయకులు మరియు పంచాయితీ అదికారులు ఎమ్.ఎస్ ఆర్ సంఘంలో ప్రజలు తెలిపిన సమస్యలు పరిస్కరించాలని జనసేన పార్టీ తరపున కోరుతున్నట్లు గుడ్లురు మండల జనసేన నాయకులు. ఇ శ్రీనివాసులు, కోలక లూరి ఆమోస్, మాధవ, హజరత్, రాంబాబు, ఆళ్ళ శివ, సాగర్, ప్రతాప్, తదితరులు కోరారు. సమస్యలను పరిష్కరించ లేనప్పుడు జనసేన పార్టీ పోరాడుతుందని గుడ్లూరు మండల కన్వీనర్ అన్నంగి చలపతి అన్నారు. పవన్ కళ్యాణ్ గారిని సీఎం ని చేస్తేనే రాష్ట్రానికి హాదా, రాజధాని, రాష్ట్ర అభివృద్ది, గ్రామాల అభివృద్ధి జరుగుతుందని.. అన్నంగి చలపతి ప్రలాప్, ఆమెస్, శ్రీనివాసులు సాగర్ అన్నారు.