గల్ఫ్ సేన – జనసేన సభ్యులకు కృతజ్ఞతలు

రాజోలు మండలం, చింతలపల్లి గ్రామానికీ చెందిన మహిళ ఎన్నో ఆశలతో, కుటుంబ పోషణకు పరాయి దేశం వెళ్ళి ఏజెంట్ చేతుల్లో చిక్కి భర్తకు, పిల్లలకు ఆరోగ్యం బాగుండ లేకపోవటంతో తిరిగి వెళ్ళలేని పరిస్థతుల్లో ఉన్న ఒక నిరుపేద దళిత మహిళను గల్ఫ్ సేన – జనసేన యూఏఈ రక్షించి ఆమెకు టికెట్ ఇచ్చి వారి కుటుంబ సభ్యుల దగ్గరకి సురక్షితం గా పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమెకు ధైర్యం చెప్పి, ప్లైట్ టిక్కెట్ తీసి ఆమెను స్వగ్రామానికి చేర్చిన గల్ఫ్ సేన – జనసేన గ్రూప్ సభ్యులకు, ముఖ్యంగా శ్రీ కేసరి త్రిమూర్తులు గారికి ఆమె కుటుంబ సభ్యులు, మరియు జనసేన నాయకులు కోళ్ళ బాబి, చిరంజీవి యువత తులా ఆది హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసారు.