పాలకొల్లులో గాంధీ మహాత్మునికి జనసేన నాయకుల నివాళులు

పాలకొల్లు నియోజకవర్గం: జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మల సెంటర్ నందు మహాత్మా గాంధీ జయంతి ఘనంగా జరిగింది.
ఈ సందర్బంగా జనసేన జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్, యలమంచిలి మండల గౌరవ అధ్యక్షులు డేగల సత్తికొండ, పాలకొల్లు మండల గౌరవ అధ్యక్షులు నల్లమోతు సత్యప్రసాద్, పోడూరు మండల అధ్యక్షులు పీతాని వెంకటేష్, పాలకొల్లు పట్టణ కార్యదర్శి యాళ్ల రవీంద్ర నాయుడు గాంధీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా నాయకులు ఉన్నమట్ల ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ గాంధీ చెప్పిన అహింసావాదం అనుసరణీయం అని జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మహనీయుల అడుగుజాడల్లోనే ముందుకు సాగుతున్నారని జనసైనికులు అంతా పవన్ కళ్యాణ్ గారి మాటే శిరోదార్యంగా భావించి నియోజకవర్గంలో జాతీయ నాయకుల పండుగలు కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో అంబటి విజయ్ కుమార్, ఇనుకొండ రమేష్, పి.రఘపతి రాజు, దాసిరెడ్డి పుష్పరావు, మేడికొండ ధన, చేగొండి వెంకటేశ్వరరావు, పోసింశెట్టి వెంకట రమేష్, గంట ముత్యాల రావు, ముత్యాలపల్లి మణికంఠ, బుడ్డెపు వెంకీ, ఆర్. ప్రసాద్, ఇంటి ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.