కడగళ్ల గౌరమ్మ, పిన్నింటి పైడితల్లిల కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన నాయకులు

దెందులూరు, కొల్లేరులో పడవ ప్రమాదంలో మృతిచెంది ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో ఉన్న దెందులూరు నియోజకవర్గం, మాదేపల్లి గ్రామానికి చెందిన కడగళ్ల గౌరమ్మ, పిన్నింటి పైడితల్లిల భౌతికకాయాలని సందర్శించి వారి కుటుంబ సభ్యులని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఇళ్ళ శ్రీనివాస్, పార్టీ జిల్లా కార్యదర్శి ముత్యాల రాజేష్, జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు, పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు బొడ్డు గిరిబాబు, లింగారగూడెం గ్రామ జనసేన నాయకులు పలిపే ప్రవీణ్ మరియు జనసైనికులు పరామర్శించడం జరిగింది.