మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని జనసేన నిరసన

ఉంగుటూరు నియోజకవర్గం, సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నిడమర్రు మండలం ఛానమిల్లి గ్రామంలో జనసైనికులు నివాళులు అర్పించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు విడుదల చేసిన 14, 15 వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతరత్రా మళ్లించడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. మళ్లించిన నిధులను తిరిగి పంచాయతీ ఖాతాలకు జమ చేయాలని ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచారు. ఈ కార్యక్రమంలో అడవికొలను జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ పాల వెంకన్న, ఛానమిల్లి గ్రామ ఉప సర్పంచ్ కొండపల్లి శేఖర్, గౌతు వెంకన్న, గ్రామ పెద్దలు, జనసైనికులు పాల్గొన్నారు.