మార్కాపురం జిల్లా సాధన కై 2వ రోజు దీక్షా శిబిరానికి శ్రీకారం చుట్టిన జనసేన

మార్కాపురం జిల్లా సాధన కై మార్కాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు మార్కాపురం జిల్లా సాధన సమితి జె.ఏ.సి వైస్ చైర్మన్ ఇమ్మడి కాశీనాథ్ మార్కాపురం మండలం కె.కొత్తపల్లి జనసైనికులతో 2వ రోజు దీక్షా శిబిరంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, శిరిగిరి శ్రీనివాస్, శేఖర్, వెంకట్, జనసేన యువకులు మరియు జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.