జీవకోన యువతతో పసుపులేటి భేటీ

  • రాబోవు ఎన్నికల్లో మనం యుద్ధం చేయాలి – డా పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి: జీవకోన యువతతో సోమవారం పసుపులేటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ మనల్ని ముందుకి తీసుకెళ్ళే సైనికుడు లాంటి గొప్ప నాయకుడి వెంట మనం నడుస్తున్నాం, అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్, అయన యుద్ధం మనకోసం చేస్తున్నారు ఆయనకి తోడుగా మనం యుద్ధంలో చేయాలి. రాబోవు ఎన్నికల్లో డబ్బుకోసం కాదు మన భావితరాల భవిష్యత్ కోసం మనం యుద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని గెలిపించి సీఎం చేద్దాం అంటూ జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రజలను ప్రభావితం చేసారు.