మరో వివాదంలో కంగనా.. పరువు నష్టం దావా వేసిన బాలీవుడ్ సినీ గేయ రచయిత..

కంగనా రనౌత్ .. బాలీవుడ్ రెబల్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకుంది. ఏ విషయాన్నైనా కుండ బద్దలు కొట్టేలా మాట్లాడటం కంగనాకు అలవాటు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మరణంపై అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్‌లను ఓ ఊపు ఊపేసింది ఈ భామ. ఎన్నో విమర్శలను ఎదుర్కొని ఆఖరికి మహారాష్ట్ర ప్రభుత్వం, శివసేన పార్టీతో ఢీ అంటే ఢీ అంది. ఈ గొడవ వల్ల ముంబైలో శివసేన నాయకులు కంగనా ఇళ్లును కూడా కూల్చేశారు. అయినా కంగనా బెదరకుండా పోరాడింది. అయితే తాజాగా మరో వివాదంలో నిలిచింది ఈ భామ.

అయితే.. తాజాగా కంగనా పై ప్రముఖ బాలీవుడ్ సినీ, గేయ రచయత జావేద్ అక్తర్ పరువు నష్టం దావా వేసారు. కంగనా రనౌత్ ఓ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేసిందన్నారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడం వెనక అనవసరంగా తన పేరును లాగారని ఆరోపిస్తూ జావేద్ అక్తర్.. కంగనా రనౌత్ పై ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా కేసు వేసారు. కంగనా పై ఐపీసీ సెక్షన్ 499, 500 కింద పరువు నష్టం కేసు నమోదు చేయాలని జావేద్ అక్తర్ కోరారు. ఒక ఈ కేసులో తనపై అనవసరంగా బురద చల్లినట్టు కంగనా మాట్లాడిన వీడియో క్లిప్పింగులను జావేద్ అక్తర్ జత చేశారు.