శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభం

ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో కార్తిక మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి డిసెంబర్‌ 4 వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి.

శ్రీశైలం మల్లన్న ఆలయంలో శుక్రవారం కార్తిక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్తిక మాసోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో భక్తులు మల్లికార్జునస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. కార్తికమాసోత్సవాల సందర్భంగా శ్రీగిరీశుడు మల్లికార్జున స్వామి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలంయంలోని గంగాధర మండపం వద్ద భక్తులు కార్తిక దీపారాధనలు చేస్తున్నారు. భక్తుల తాకిడితో ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు.