జనంతో జనసేన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన కిరణ్ రాయల్

తిరుపతి, తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ జనంతో జనసేన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. వారాహి తర్వాత ప్రతి ఇంటికి జనసేన వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని, వారికి అండగా నిలబడి, సంబంధిత సమస్యల పరిష్కార దిశగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని కిరణ్ రాయల్ తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లు, స్టిక్కర్లు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శి నాగబాబు, నేషనల్ మీడియా కో-ఆర్డినేటర్ అజయ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది.