పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరికి జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని తెలిపిన మదనపల్లె జనసేన

మదనపల్లె, భీమ్లా నాయక్ మదనపల్లెలో అన్ని సినిమా హాల్లలో 4 ఆటలు విడుదల చేయడం జరిగింది. ఫ్యాన్స్ షో లేదు, ఎక్స్ట్రా షో లేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు జనసైనికులు చాలా మంది ప్రక్కనే ఉన్న ములభాగలు, కోలార్, బెంగళూర్ లో ఉదయం 5 గంటలకే చాలా మంది సినిమా చూసి బ్లాక్ బుస్టర్ హిట్ అని ఆనందంగా ఫోన్ చేసి తెలియజేయడం జరిగింది. రవి థియేటర్ లో చూడడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ఫాన్స్ అందరికి జనసేన క్రియాశీలక సభ్యత్వం చేసుకోవాలని ఈ సందర్భంగా జనసేన రాయలసీమ కో కన్వినర్ గంగారపు రామదాసుచౌదరి, జిల్లా ప్రధాన కార్యదర్శి శివరాం, జిల్లా సెక్రెటరి సనఉల్లా, మదనపల్లె టౌన్ ప్రధాన కార్యదర్శి రెద్దమ్మ, మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, మండల ప్రధాన కార్యదర్శి గౌతమ్ చెప్పడం జరిగింది. టిక్కెట్ రేట్లు తగ్గించి 4 ఆటలకే పరిమితం చేసిన సందర్భంగా ప్రభుత్వం చాలా నష్టపోతోందని… ఎందుకంటే తెలంగాణ తమిళ నాడు కర్ణాటక లో 5 నుండి 6 ఆటలు మరియ ఫ్యాన్ షోస్ అన్ని వారు వేయడం జరిగిందని తెలిపారు.