జనసేన ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయండి: మార్కండేయ బాబు

ఈ నెల 14వ తేది జరగబోయే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల గురించి కర్నూలు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నాయకుల సమక్షంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మార్కండేయ బాబు అధ్యక్షతన, కర్నూలు పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మార్కండేయ బాబు మాట్లాడుతూ.. కర్నూలు జిల్లా నుంచి జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అలాగే జనసేన పార్టీ నిర్వహించిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి పలు నియోజకవర్గాల్లో ఎక్కువ సభ్యత్వాలు చేసిన వాలంటీర్లను అభినందించారు. సభ్యత్వాలు తక్కువ చేసిన వారికి పలు సూచనలు చేశారు. పాణ్యం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చింతా సురేష్ బాబు మాట్లాడుతూ.. రేపు జరగబోయే సభ ప్రాంగణానికి కర్నూలు జిల్లా వాస్తవ్యులు దళిత బిడ్డ గౌరవనీయులు దామోదరం సంజీవయ్య ఆదర్శంగా ఆయన పేరున దామోదరం సంజీవయ్య చైతన్య వేదికగా నిర్ణయించిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వివిధ నియోజకవర్గాల నుంచి జనసైనికులు, వీర మహిళలు ఎనిమిదవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు భారీ సంఖ్యలో పాల్గోనేందుకు అన్ని నియోజకవర్గాల నుంచి సిద్ధమౌతున్నారు అని తెలియజేశారు. మంత్రాలయం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ లక్ష్మన్న మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కరోనా వల్ల గత రెండు సంవత్సరాలు జరుపుకోలేకపోయాము, ఈ సారి జరగబోయే జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పాల్గోని విజయవంతం చేస్తాం అని తెలిపారు. ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ రేఖ గౌడ్ మాట్లాడుతూ.. ఆవిర్భావ దినోత్సవం అనేది మాకో పండుగ లాంటిది. కర్నూలు జిల్లా నుంచి జనసైనికులు, వీర మహిళలు పాల్గొని విజయవంతం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-03-10-at-7.32.37-PM-1024x493.jpeg