జనసేన కార్యకర్త గోవిందరాజును పరామర్శించిన మాకినీడి

పిఠాపురం: గొల్లప్రోలు మండలం, తాడిపర్తి గ్రామానికి చెందిన జనసైనికుడు పాశం గోవిందరాజులు ఇటీవల యాక్సిడెంట్లో గాయపడ్డారని విషయం మండల ప్రెసిడెంట్ వల్లి రామకృష్ణ ద్వారా తెలుసుకున్న పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషకుమారి వారిని శనివారం పరామర్శించి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని డాక్టర్లు సూచించిన మేరకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, గారపాటి శివ కొండారావు, అడబాల వీర్రాజు, జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.