జల్లికట్టు వీక్షించడానికి వచ్చినవారికి జనసేన ఆధ్వర్యంలో భోజన సదుపాయం

చంద్రగిరి నియోజకవర్గంలోని, రంగంపేటలో కనుమ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం జల్లికట్టు జరుగుతుంది వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం వేలాదిమంది వీక్షించడానికి విచ్చేసినవారికి చంద్రగిరి మండల అధ్యక్షులు బొమ్మల కిషోర్, రంగంపేట నాయకుల నేతృత్వంలో, చిత్తూరు జిల్లా జనసేన కార్యదర్శి దేవర మనోహర చేతులు మీదుగా 1200 మందికి భోజనము పాకెట్లు, మజ్జిగ మరియు నీళ్ళ పాకెట్లు అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, లీగల్ సెల్ ఉపాధ్యక్షురాలు కంచి శ్యామల, అజయ్ ప్రసన్న, వేణు, కరుణాకర్, నాగార్జున, అమర్, బాల మురళి, ధరణి, కిరణ్, గజేంద్ర, రాకేష్, సాయిరాం లక్ష్మణ్, ఢిల్లీ, దిలీప్ రాయల్, రాంబాబు, జాని పాల్గొనటం జరిగింది.