భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై న్యూజిలాండ్ నిషేధం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతున్న క్రమంలో ఇతర దేశాలు అప్రమత్తమయ్యాయి. భారత్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధించాలని న్యూజిలాండ్ నిర్ణయించింది. ఈ మేరకు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్ అధికారిక ప్రకటన చేశారు. భారత ప్రయాణికులతో పాటు న్యూజిలాండ్ పౌరులపై తాత్కాలికంగా నిషేధం విధించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ నిబంధన ఏప్రిల్ 11వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

భారత్‌లో నిన్న ఒక్కరోజే లక్షా 25 వేలకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ర్టలో అత్యధికంగా 60 వేల పాజిటివ్ కేసులు, ఛత్తీస్‌గఢ్‌లో 10 వేలు, కర్ణాటక, యూపీలో 6 వేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో కరోనా టీకా కొరత కూడా ఏర్పడిందని ఆయా రాష్‌ర్టాలు చెబుతున్నాయి.