MSME- టెక్నాల‌జీ సెంట‌ర్‌ ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ‌కు చెందిన బెంగ‌ళూరులోని టెక్నాల‌జీ సెంట‌ర్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 10 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. డిగ్రీ, ఇంజనీరింగ్‌ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్య సమాచారం:

మొత్తం ఖాళీలు: 10

పోస్టులు: సీనియ‌ర్ మేనేజ‌ర్‌, మేనేజ‌ర్, అసిస్టెంట్ మేనేజ‌ర్‌, ఇంజినీర్‌, అకౌంట్స్ ఆఫీస‌ర్‌, స్టోర్స్ ఆఫీస‌ర్‌ పోస్టులన్నాయి.

విభాగాలు: ట్రెయినింగ్‌, టెస్టింగ్‌, మార్కెటింగ్‌, డిజైన్‌, ప్రొడ‌క్ష‌న్‌ విభాగాలుంటాయి.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు నిర్దిష్ట అనుభ‌వం ఉండాలి.

వయసు: పోస్టులను బట్టి 32 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: సెప్టెంబర్‌ 20, 2020

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: THE PRINCIPAL DIRECTOR I/c, INSTITUTE FOR DESIGN OF ELECTRICAL MEASURING INSTRUMENTS (IDEMI), EASTERN EXPRESS HIGHWAY, CHUNABHATTI, SION P.O., MUMBAI – 400 022.

వెబ్‌సైట్‌: http://www.idemi.org/ పూర్తి వివరాలను చూడగలరు