మాకినీడి ఆధ్వర్యంలో రైతన్నల కోసం గురువారం పాదయాత్ర ఛలో కలెక్టర్ కార్యాలయం

పిఠాపురం నియోజవర్గం జనసైనికులకు, నాయకులకు, వీరమహిళలకు జిల్లా కార్యదర్శులకు మండల అధ్యక్షులకు విజ్ఞప్తి. పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి ఆధ్వర్యంలో గురువారం 3-2-2022 మధ్యాహ్నం 1:00 దుర్గాడ గ్రామం నుండి రైతన్నల కోసం పాదయాత్ర ఛలో కలెక్టర్ కార్యాలయం నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామాల్లో వైరస్ తెగుళ్ళుకు దెబ్బతిన్న పచ్చి మిర్చి, ఉల్లి మరియు తదితర పంటలలు తీవ్ర నష్టానికి గురయ్యాయి సుమారుగా 800 వందల ఎకరాలు రైతులు, కౌలు రైతులు తీవ్ర నష్టాన్ని కలిగించాయి ఈ విషయాన్ని గౌరవనీయులు కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది శాంతియుతంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. పాదయాత్రగా తేదీ 3-2-2022 అనగా గురువారం మధ్యాహ్నం 1:00 కు, దుర్గాడ నుంచి పిఠాపురం వరకు శుక్రవారం 4-2-2022 ఉదయం 6:00 గంటల నుండి పాదయాత్ర కొనసాగిస్తూ. కాకినాడ కలెక్టర్ కార్యాలయంకు చేరుకుంటామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీమతి మాకినీడి శేషుకుమారి మరియు రైతన్నలు, కౌలు రైతులతో జనసేన నాయకులు, జనసైనికులు జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు వీరమహిళలు, రైతులతో కలిసి పాల్గొన్నారు..కావున ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ పాదయాత్రలో పాల్గొని రైతన్నలకు అండగా నిలబడతారని మన అధ్యక్షులుశ్రీ పవన్ కళ్యాణ్ ఆశయాలు ముందుకు తీసుకువెళ్లాలని కోరి ప్రార్థిస్తున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం కొరకు తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్, పీఏసీ సభ్యులు పంతం నానాజీ, ముత్తా శశిధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నగర అధ్యక్షులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు.