కురవ సంఘం ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న సుగవాసి బాలసుబ్రహ్మణ్యం

అన్నమయ్య జిల్లా, టి. సుండుపల్లె మండల కేంద్రంలో రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బిజెపి ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం కురువ కుల సేవా సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి బాలసుబ్రమణ్యం ముఖ్యఅతిథిగా హాజరై ఎమ్మెల్యేగా నన్ను గెలిపించిన వెంటనే మీ సమస్యల పరిస్కారనికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే కురవలందరూ సుమారుగా మండలంలో పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసి పార్టీలో చేరి అభ్యర్థికి సంపూర్ణమద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సీనియర్ నాయకులు మంగిరి రమణయ్య, రాజంపేట నియోజకవర్గం కురవ సంఘం అధ్యక్షులు గంతల చెన్న కృష్ణ, మండల అధ్యక్షులు ఎం.జయరామ్, ప్రధాన కార్యదర్శి సురేష్, ఈ కార్యక్రమానికి రాజంపేట అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్, జనసేన మాజీ మండల అధ్యక్షుడు గాలి వెంకటరమణ, శ్రీనివాసరాజు, శ్రీరాములు, టీడీపీ నాయకులు దామోదర్ నాయుడు, యర్రం రెడ్డి, కులాయప్ప, వెంకటేష్, అశోక్, అంజి, సతీష్, జయరామ్, చెన్నకృష్ణ, జగదీష్, రామోహన, రామంజులు, సుధాకర్, సుబ్బయ్య, రగురామయ్య, నవీన్ బాబు, రవిప్రకాష్, సిద్దేశ్వర తదితర కురవ కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.