జనవాణి జనసేన బరోసా కార్యాక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోండి: షేక్ సుభాని

ఉదయగిరి, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు, ప్రభుత్వం పట్టించుకోకపోతే జనసేన పార్టీ నిర్వహించే జనవాణి జనసేన బరోసా కార్యాక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావాలని తద్వారా మీ సమస్యలపై జనసేన పార్టీ పోరాడుతుందని జనసేన పార్టీ వింజమూరు మండలం ఉపాధ్యక్షులు షేక్ సుభాని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా సుభాని భాయ్ మాట్లాడుతూ జులై 3వ తేదిన విజయవాడలోని మాకినని బసవ పున్నయ్య ఆడిటోరియంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు జనవాణి జనసేన భరోసా కార్యాక్రమాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తుందని ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని మండలం నుంచి జిల్లా స్ధాయి దాకా సామాన్యులు ఎదుర్కుంటున్న సమస్యలను తెలుపుకోవచ్చు అని కోరారు. ఇప్పకటికే కౌలు రైతు బోరసా యాత్రతో రైతు పాలిటీ దేవుడుగా మారిన మా నాయకులు ఈ జనవాణి జనసేన బోరసాతో పార్టీ ఇంకా ప్రజల్లోకి వెళ్ళుతుంది రాష్ట్రంలో ప్రజలు సమస్యలని ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అలానే అమ్మఒడితో చాలా మందికి అన్యాయం జరిగింది. త్వరలో వింజమూరు మండలంలో ఉన్నా నాయకులు, కార్యకర్తలు సహకారంతో మా నాయకులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులుతో జిల్లా అధ్యక్షులు మనుక్రాంత్ రెడ్డి ఆదేశానుసారం ప్రజలు సమస్యలు తెలుసుకోవడం కోసం “ఇంటింటికి జనసేన, జనంలోకి జనసేన” అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకుంటామని అన్నారు.