రఘురామకృష్ణరాజుకు షాక్.. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్ రిటర్న్

అక్రమ ఆస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ పై బయటున్న సంగతి తెలిసిందే. అయితే సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్ ను సీబీఐ కోర్టు రిటర్న్ చేసింది. సరైన పత్రాలు లేని పిటిషన్లపై విచారణ చేపట్టలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. పిటిషన్ ప్రొసీడింగ్స్ లోపభూయిష్టంగా ఉన్నాయని అభిప్రాయపడింది.

గత కొంతకాలంగా వైసీపీకి రఘురామకృష్ణరాజు పక్కలో బల్లెంలా తయారయ్యారు. సాంకేతికంగా పార్టీలోనే ఉన్నప్పటికీ, పార్టీ అధిష్ఠానాన్ని తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. నేరుగా సీఎం జగన్, విజయసాయిరెడ్డిలను లక్ష్యంగా చేసుకుని రచ్చబండ పేరుతో మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు.