రూ.75 నాణాన్ని రిలీజ్ చేసిన ప్రధాని మోదీ

ఈఏడాది నోబెల్ శాంతి బహుమతి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాంకు దక్కడం గొప్ప విజయం అని.. ఇందులో భారత్ సహకారం ఉండటం చరిత్రలో నిలిచిపోతుందని ప్రధాని మోదీ  పేర్కొన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు, అధికారులతో మాట్లాడారు మోదీ. ఈ సందర్భంగా 17 కొత్త ఫెర్టిలైజర్ వెరైటీస్ ని జాతికి అంకితం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 75ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 రూపాయల నాణేన్ని రిలీజ్ చేశారు. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఫుడ్ డేను కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.